Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:19 PM

పెట్రోల్‌ను జీఎస్టీలోకి తీసుకురావద్దంటున్న రాష్ట్రాలు

పెట్రోల్‌ను జీఎస్టీలోకి తీసుకురావద్దంటున్న రాష్ట్రాలు

పెట్రోల్‌ను జీఎస్టీలోకి తీసుకురావద్దంటున్న రాష్ట్రాలు
January 10, 2026 07:27 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Deshamkosam

జియేస్టీలోకి వస్తే లీటర్ పెట్రోల్ ధర భారీగా తగ్గే అవకాశం.

పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు సూచించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. పెట్రోల్‌పై రాష్ట్రాలు వసూలు చేస్తున్న వ్యాట్‌ (VAT) ద్వారానే తమకు భారీ ఆదాయం వస్తోందని, జీఎస్టీలోకి తీసుకొస్తే ఆ ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్రాల వాదన.

ప్రస్తుతం పెట్రోల్ ధరలో కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది. కానీ రాష్ట్రాలు వేర్వేరుగా పన్నులు వేయడం వల్లే రాష్ట్రానికొక ధరగా పెట్రోల్ అమ్ముడవుతోంది.

నిపుణుల అంచనాల ప్రకారం,

  1. రాష్ట్ర పన్నులు లేకపోతే లేదా జీఎస్టీలోకి పెట్రోల్ వస్తే
  2. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర సుమారు ₹90–₹92 మధ్య ఉండే అవకాశం ఉంది.

పెట్రోల్ ధరల తులనాత్మక పట్టిక

(కేంద్ర ధర ఒకటే – రాష్ట్రాల వల్లే తేడా)

గమనిక:
కేంద్ర ధర = కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ + బేస్ ధర (సుమారు ₹92)


రాష్టం పేరు. కేద్రం ధర. రాష్టం ధర

ఢిల్లీ₹92₹95
ఉత్తర ప్రదేశ్₹92₹95
గుజరాత్₹92₹95
మహారాష్ట్ర₹92₹105
కర్ణాటక₹92₹103
తమిళనాడు₹92₹101
తెలంగాణ₹92₹108
ఆంధ్రప్రదేశ్₹92₹109
కేరళ₹92₹106
రాజస్థాన్₹92₹110
పశ్చిమ బెంగాల్₹92₹105

ప్రజలకు ఏమి అర్థంకావలిసినివి

  1. కేంద్ర ప్రభుత్వం వేసే పన్ను అన్ని రాష్ట్రాల్లో ఒకటే
  2. ధరలు ఎక్కువ కావడానికి రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ప్రధాన కారణం
  3. జీఎస్టీలోకి పెట్రోల్ వస్తే
  4. రాష్ట్ర పన్నులు తగ్గుతాయి
  5. లీటర్‌కు ₹10 నుంచి ₹18 వరకు తగ్గే అవకాశం

తుది మాట

రాష్ట్రాల ఆదాయ భయమే పెట్రోల్‌ను జీఎస్టీకి దూరంగా ఉంచుతోంది.

కానీ అదే సమయంలో, పెరుగుతున్న ధరల భారం మాత్రం నేరుగా సామాన్యుడి మీదే పడుతోంది.

పెట్రోల్ జీఎస్టీలోకి వస్తే ప్రజలకు ఊరట కలగనుంది — కానీ రాష్ట్రాల అంగీకారం ఇప్పటికైతే కనిపించడం లేదు



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News