కలుపు నివారణ కోసం ఉపయోగించే పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందును పిచికారీ చేసే సమయంలో పొరపాటున శరీరంలోకి వెళ్లితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పారాక్వాట్ విష ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి ప్రాణాపాయం కలగవచ్చు. ఈ విషానికి ప్రత్యేకమైన యాంటీడోట్ లేకపోవడం వల్ల చిన్న మోతాదులోనూ ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గడ్డి మందు అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. రైతులు పారాక్వాట్ మందును పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు, రక్షణ పరికరాలు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి