Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

ప్రజాసేవకు 'సెలవు'.. ప్రభుత్వ కార్యాలయాల్లో అటకెక్కిన పనులు! లాంగ్ వీకెండ్ మోజులో అధికారులు - కార్యాలయాల చుట్టూ సామాన్యుల ప్రదక్షిణలు

ప్రజాసేవకు 'సెలవు'.. ప్రభుత్వ కార్యాలయాల్లో అటకెక్కిన పనులు! లాంగ్ వీకెండ్ మోజులో అధికారులు - కార్యాలయాల చుట్టూ సామాన్యుల ప్రదక్షిణలు

ప్రజాసేవకు 'సెలవు'.. ప్రభుత్వ కార్యాలయాల్లో అటకెక్కిన పనులు! లాంగ్ వీకెండ్ మోజులో అధికారులు - కార్యాలయాల చుట్టూ సామాన్యుల ప్రదక్షిణలు
December 27, 2025 09:37 PM 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కార్యాలయాలకు తాళం.. సామాన్యుడికి నరకం!
అధికారులకు 'లాంగ్ వీకెండ్' సరదా - ప్రజలకు తప్పని వెతలు.
ప్రజాపాలన పడకేసింది.. సెలవుల పేరుతో కాలయాపన.
ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీ - బయట జనం పడిగాపులు.

వారాంతపు సెలవులకు అదనంగా సెలవులు జతచేసి, ప్రభుత్వ కార్యాలయాలకు గైర్హాజరవడం రాష్ట్రంలో ఒక ఆనవాయితీగా మారుతోంది. "శుక్రవారం నుంచే మూడ్ ఆఫ్.. సోమవారం కూడా రెస్ట్" అన్న రీతిలో కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఫలితంగా అత్యవసర పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రజలకు అందాల్సిన కీలక సేవలు, ముఖ్యంగా ధ్రువపత్రాలు, ఆదాయ-కుల సర్టిఫికెట్లు, పింఛన్లు, భూ సంబంధిత రికార్డుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. అధికారులు సీట్లలో లేకపోవడంతో ఫైళ్లు ముందుకు కదలడం లేదు.

వృథా అవుతున్న సమయం, డబ్బు: దూరప్రాంతాల నుంచి, పనులను వదులుకుని, ప్రయాణ ఖర్చులు భరించి వచ్చే గ్రామీణ ప్రజలకు నిరాశే మిగులుతోంది. "సార్ లేరు.. రేపు రండి" అనే సమాధానాలతో కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిఘా కరువు: ప్రజాసేవనే పరమావధిగా భావించాల్సిన యంత్రాంగం, సెలవుల గణాంకాలకే పరిమితం కావడం విచారకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, ప్రజల సమయానికి విలువనిచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News