పాన్ కార్డు నిబంధనల్లో సంచలన మార్పులు
పాన్ కార్డు నిబంధనల్లో సంచలన మార్పులు
GADDAM JAGANMOHAN REDDY
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు
న్యూఢిల్లీ: పాన్ కార్డు వినియోగంపై కీలక మార్పులను ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం–2025 ద్వారా పన్ను విధానాన్ని మరింత సరళతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా ఇండియా లో అమలులోకి రానున్నాయి.
సెక్షన్ల సంఖ్య భారీగా తగ్గింపు
పాత చట్టంలో ఉన్న విభాగాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం సెక్షన్ల సంఖ్యను 536కు కుదించారు. క్లిష్టమైన నిబంధనలను సులభంగా అర్థమయ్యేలా మార్చడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు స్పష్టత కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్కరణలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బ్యాంకింగ్ లావాదేవీల్లో సడలింపు
ఇప్పటివరకు రోజుకు రూ.50 వేలకుపైగా నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరి కాగా, కొత్త నిబంధనల ప్రకారం వార్షికంగా రూ.10 లక్షల వరకు పరిమితి నిర్ణయించారు. దీంతో చిన్నచిన్న లావాదేవీలకు తరచుగా పాన్ చూపాల్సిన అవసరం తగ్గనుంది.
ఆస్తి కొనుగోలు, హోటల్ బిల్లులపై మార్పులు
ఆస్తి కొనుగోలులో పాన్ చూపాల్సిన కనీస పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. హోటళ్లలో ఒక్కసారిగా చెల్లించే బిల్లుల విషయంలో ఈ పరిమితిని రూ.1 లక్షగా నిర్ణయించారు.
వాహనాల కొనుగోలుకు ఊరట
రూ.5 లక్షల లోపు విలువ గల వాహనాల కొనుగోలుకు పాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. మధ్యతరగతి వర్గాలకు ఇది ఉపశమనం కలిగించనుంది.
పన్ను విధానాన్ని సరళతరం చేస్తూ సామాన్యులకు భారం తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి