PRINT TIME: July 11, 2026 04:02 AM
నేడు ఢిల్లీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
నేడు ఢిల్లీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
March 08, 2026 08:19 AM
83 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఢిల్లీ మెట్రోలో మజ్లిస్ పార్క్–మౌజ్పూర్ బాబర్పూర్ పింక్ లైన్, దీపాలి చౌక్–మజ్లిస్ పార్క్ మెజెంటా లైన్ మార్గాలను ప్రధాని ప్రారంభించనున్నారు.
అలాగే ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణలో భాగంగా మూడు కొత్త మార్గాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీంతో నగరంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి