Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:38 PM

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన
February 02, 2026 09:07 AM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ : న్యాల్కల్ మండల కేంద్రంలో ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వెంటనే ప్రతిపక్ష నేతలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ (X) పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, వెంకట్, ముజఫర్ పటేల్, ఇసాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News