Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:16 PM

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన

న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన
February 02, 2026 09:07 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ : న్యాల్కల్ మండల కేంద్రంలో ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వెంటనే ప్రతిపక్ష నేతలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ (X) పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, వెంకట్, ముజఫర్ పటేల్, ఇసాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News