న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన
న్యాల్కల్ రోడ్డెక్కిన ఎన్సీపీ.. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తల ఆందోళన
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ : న్యాల్కల్ మండల కేంద్రంలో ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. వెంటనే ప్రతిపక్ష నేతలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ (X) పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, వెంకట్, ముజఫర్ పటేల్, ఇసాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి