Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:54 AM

నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా 'కైట్ ఫెస్టివల్'.. ఉత్సాహంగా పాల్గొన్న యువత

నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా 'కైట్ ఫెస్టివల్'.. ఉత్సాహంగా పాల్గొన్న యువత

నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా 'కైట్ ఫెస్టివల్'.. ఉత్సాహంగా పాల్గొన్న యువత
January 16, 2026 04:51 PM 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం న్యూస్.

నకిరేకల్ నియొజికవర్గం: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కైట్ ఫెస్టివల్' (పతంగుల పండుగ) అత్యంత వైభవంగా జరిగింది. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో యువత మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.

ఐక్యతకు ప్రతీక సంక్రాంతి: ఏనుగు రఘుమా రెడ్డి

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి అనేది రైతుల పండుగ అని, పల్లెల్లో ఐక్యతను చాటే గొప్ప పర్వదినమని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, క్రీడా పోటీల్లో చురుకుగా పాల్గొన్నప్పుడే నాయకత్వ లక్షణాలు అలవడుతాయని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉత్సాహంగా పతంగుల వేట

వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోనిచెర్వు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆకాశంలో రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. వేముల అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో :

సర్పంచ్‌లు: అందె అండాలు-రాములు యాదవ్, కట్ట ఆశయ్య.

గ్రామశాఖ అధ్యక్షులు: సుర్కంటి సత్తిరెడ్డి (వెలిమినేడు), కందాటి మహేందర్ రెడ్డి (బొంగోనిచెరువు).

ఉప సర్పంచ్‌లు: నారగోని నాగరాజు యాదవ్, సామిడి సాయికృష్ణ రెడ్డి.

ముఖ్య నేతలు: పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, వార్డు సభ్యులు వరికుప్పల సంగీత సుధాకర్, చిర్రగోని శ్రీశైలం, దేశబోయిన మంజుల మల్లేష్, మంకాల లింగస్వామి, చింతకింది వెంకటేష్ తదితరులు ఉన్నారు.

నాతి స్వామి, బరిశెట్టి గొవర్ధన్, మెడగొని సత్తయ్య, బొంతల నరేందర్ రెడ్డి, కర్దూరి మల్లారెడ్డి, కూరకుల సుధీర్ కుమార్, మేడగొని సురేష్ యాదవ్, ఏనుగు శ్రీనురెడ్డి, అందే చందు యాదవ్, జక్కలి రాజు, అందే శివ, మంకాల నరేందర్, పల్లె మల్లేశ్, చిరగొని శ్రీశైలం, చెరుకు నాగరాజు, పంది భాస్కర్, గాదే ప్రశాంత్, మేడి మహేష్, కట్ట దయానంద్, కొండే మహేష్, వడ్డెపల్లి చింటు, దేవిరెడ్డి అనిల్ రెడ్డి, దేవరపల్లి నవీన్ రెడ్డి, కొండా రాజు, చిన్నం వెంకటేష్, వరికుపల ప్రదీప్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వీరితో పాటు పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News