Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:59 PM

మార్చి 13న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం విడుదల

మార్చి 13న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం విడుదల

మార్చి 13న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం విడుదల
March 10, 2026 10:33 AM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కర్నూలు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద అర్హులైన రైతులకు ఈ నెల 13న ఆర్థిక సాయం విడుదల కానుందని జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్ వరలక్ష్మి తెలిపారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో రూ.4 వేల చొప్పున జమ చేసినట్లు చెప్పారు. చివరి విడతగా రూ.2 వేల మొత్తాన్ని ఈ నెల 13న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

పథకం ప్రయోజనాలు నిరంతరంగా పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని ఆమె సూచించారు.

అర్హులైన రైతులు తమ వివరాలను సమీప వ్యవసాయ కార్యాలయం లేదా సంబంధిత సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News