PRINT TIME: May 26, 2026 04:59 PM
మార్చి 13న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం విడుదల
మార్చి 13న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం విడుదల
March 10, 2026 10:33 AM
60 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
కర్నూలు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద అర్హులైన రైతులకు ఈ నెల 13న ఆర్థిక సాయం విడుదల కానుందని జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్ వరలక్ష్మి తెలిపారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో రూ.4 వేల చొప్పున జమ చేసినట్లు చెప్పారు. చివరి విడతగా రూ.2 వేల మొత్తాన్ని ఈ నెల 13న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
పథకం ప్రయోజనాలు నిరంతరంగా పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని ఆమె సూచించారు.
అర్హులైన రైతులు తమ వివరాలను సమీప వ్యవసాయ కార్యాలయం లేదా సంబంధిత సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి