Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల
February 23, 2026 04:39 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బంగారం ధరలకు కేంద్ర బ్యాంకులే బలం: నిర్మలా సీతారమన్

గ్లోబల్ డిమాండ్ పెరుగుదలతో ఎగిసిపడుతున్న బంగారం

అమెరికా సుంకాల ప్రభావం అంచనా వేయడం తొందరపాటు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు చేపట్టడం వల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.

ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు ఎగసిపడుతున్నాయని వివరించారు.

దేశంలో బంగారం, వెండి దిగుమతులు ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో లేవని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. అవసరమైతే తగిన విధానపరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఆర్‌బీఐకి ఉందన్నారు.

ఇటీవల అమెరికా సుంకాల్లో చేసిన మార్పుల ప్రభావంపై స్పందిస్తూ, వాటి ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే స్పష్టమైన అంచనాలు వెల్లడించగలమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News