Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:29 AM

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల
23-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బంగారం ధరలకు కేంద్ర బ్యాంకులే బలం: నిర్మలా సీతారమన్

గ్లోబల్ డిమాండ్ పెరుగుదలతో ఎగిసిపడుతున్న బంగారం

అమెరికా సుంకాల ప్రభావం అంచనా వేయడం తొందరపాటు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు చేపట్టడం వల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.

ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు ఎగసిపడుతున్నాయని వివరించారు.

దేశంలో బంగారం, వెండి దిగుమతులు ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో లేవని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. అవసరమైతే తగిన విధానపరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఆర్‌బీఐకి ఉందన్నారు.

ఇటీవల అమెరికా సుంకాల్లో చేసిన మార్పుల ప్రభావంపై స్పందిస్తూ, వాటి ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే స్పష్టమైన అంచనాలు వెల్లడించగలమని పేర్కొన్నారు.

Sthanikam

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల

Article Image

బంగారం ధరలకు కేంద్ర బ్యాంకులే బలం: నిర్మలా సీతారమన్

గ్లోబల్ డిమాండ్ పెరుగుదలతో ఎగిసిపడుతున్న బంగారం

అమెరికా సుంకాల ప్రభావం అంచనా వేయడం తొందరపాటు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు చేపట్టడం వల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.

ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు ఎగసిపడుతున్నాయని వివరించారు.

దేశంలో బంగారం, వెండి దిగుమతులు ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో లేవని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. అవసరమైతే తగిన విధానపరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఆర్‌బీఐకి ఉందన్నారు.

ఇటీవల అమెరికా సుంకాల్లో చేసిన మార్పుల ప్రభావంపై స్పందిస్తూ, వాటి ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే స్పష్టమైన అంచనాలు వెల్లడించగలమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News