కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే బంగారం ధర పెరుగుదల
GADDAM JAGANMOHAN REDDY
బంగారం ధరలకు కేంద్ర బ్యాంకులే బలం: నిర్మలా సీతారమన్
గ్లోబల్ డిమాండ్ పెరుగుదలతో ఎగిసిపడుతున్న బంగారం
అమెరికా సుంకాల ప్రభావం అంచనా వేయడం తొందరపాటు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు చేపట్టడం వల్లే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.
ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు ఎగసిపడుతున్నాయని వివరించారు.
దేశంలో బంగారం, వెండి దిగుమతులు ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో లేవని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. అవసరమైతే తగిన విధానపరమైన చర్యలు తీసుకునే సామర్థ్యం ఆర్బీఐకి ఉందన్నారు.
ఇటీవల అమెరికా సుంకాల్లో చేసిన మార్పుల ప్రభావంపై స్పందిస్తూ, వాటి ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే స్పష్టమైన అంచనాలు వెల్లడించగలమని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి