Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

కాలినడకన ప్రపంచ యాత్ర చేస్తున్న వ్యక్తి.. 27 ఏళ్లుగా 50 వేల కిలోమీటర్లు.. తుది దశకు చేరిన ప్రయాణం

కాలినడకన ప్రపంచ యాత్ర చేస్తున్న వ్యక్తి.. 27 ఏళ్లుగా 50 వేల కిలోమీటర్లు.. తుది దశకు చేరిన ప్రయాణం

కాలినడకన ప్రపంచ యాత్ర చేస్తున్న వ్యక్తి.. 27 ఏళ్లుగా 50 వేల కిలోమీటర్లు.. తుది దశకు చేరిన ప్రయాణం
December 15, 2025 02:26 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

29 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి.. కాలినడకన ప్రపంచ దేశాలను చుట్టి వచ్చే అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పటివరకు గత 27 ఏళ్లుగా పలు దేశాల గుండా దాదాపు 50 వేల కిలోమీటర్ల ప్రయాణం సాగించాడు. మరో 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. తన గమ్యస్థానం చేరుకోనున్నాడు. ఈ రెండున్నర దశాబ్దాలుగా దేశాలు, ఎడారులు, యుద్ధ భూములు, గడ్డ కట్టిన సముద్రాలను దాటేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. ఎందుకు ఇలాంటి అసాధారణ సాహసం చేస్తున్నాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.


బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ అయిన కార్ల్ బుష్బీ .. ప్రపంచ దేశాలను కాలినడకన తిరుగుతున్నాడు. 1998లో తన 29వ ఏట.. ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చే అసాధారణమైన గోలియత్ ఎక్స్‌పెడిషన్‌ను మొదలుపెట్టాడు. గత 27 సంవత్సరాలుగా నిరంతరాయంగా నడుస్తూ.. 25 దేశాలను దాటేశాడు. ఈ కాలంలో ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు నడిచాడు. ఎడారి ప్రాంతాలతోపాటు.. గడ్డకట్టిన సముద్రాలను దాటేసి.. ఇప్పుడు తన ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు కేవలం 16000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో యుద్ధాలు జరిగే దేశాల మీదుగా కూడా కార్ల్ బుష్బీ ప్రయాణం సాగించడం విశేషం.


చిలీ దేశంలో ప్రారంభమైన ఈ 50 వేల కిలోమీటర్ల నడక యాత్ర.. ఇప్పటివరకు ఏ మానవుడు చేయని సుదీర్ఘ నడక యాత్రగా నిలిచింది. 2008 ఆర్థిక సంక్షోభం, కొవిడ్-19 మహమ్మారి సహా ఎన్నో అడ్డంకులను అధిగమించిన కార్ల్ బుష్బీ.. 2026 సెప్టెంబర్ నాటికి ఇంగ్లాండ్‌లోని తన స్వస్థలం హల్‌కు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News