PRINT TIME: July 11, 2026 12:14 AM
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి
March 09, 2026 06:26 PM
51 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు ముఖ్య గమనిక జారీ చేశాయి. ఇకపై రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవాలంటే వినియోగదారులు తప్పనిసరిగా 21 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత వెంటనే మరో సిలిండర్ బుకింగ్ చేసుకునే విధానాన్ని గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేశాయి. కొత్త నియమాల ప్రకారం 21 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే రెండో సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
గ్యాస్ సరఫరాను సమర్థంగా నిర్వహించడానికి, దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్యాస్ ఏజెన్సీ సంస్థలు వెల్లడించాయి.
అందువల్ల గ్యాస్ వినియోగదారులు బుకింగ్ సమయంలో ఈ కొత్త నిబంధనలను గమనించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి