గర్భిణీలకు కేంద్రం ‘మాతృ వందన’ భరోసా – రూ.11,000 వరకు ఆర్థిక సాయం
గర్భిణీలకు కేంద్రం ‘మాతృ వందన’ భరోసా – రూ.11,000 వరకు ఆర్థిక సాయం
GADDAM JAGANMOHAN REDDY
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, శిశు సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న (పీఎమ్ఎమ్ వివై) పథకం కింద అర్హులైన మహిళలకు మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
ఈ పథకం ప్రకారం మొదటి సంతానానికి రూ.5,000 మూడు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది. గర్భధారణ నమోదు అనంతరం రూ.1,000, గర్భధారణ ఆరు నెలలు పూర్తయ్యాక రూ.2,000, శిశువు తొలి టీకా అనంతరం రూ.2,000 చొప్పున చెల్లిస్తారు.
రెండో సంతానం (ప్రత్యేకించి బాలిక జననం) సందర్భంలో అదనంగా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ విధంగా మొత్తం రూ.11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసుకోవాలనుకునే గర్భిణీలు తమ సమీప అంగన్వాడీ కేంద్రంలో ఫారం నింపి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, గర్భధారణ వైద్య నివేదిక సమర్పించాలి. అలాగే అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు.
గర్భిణీలకు పోషకాహారం, తల్లి-శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి