Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:42 AM

గర్భిణీలకు కేంద్రం ‘మాతృ వందన’ భరోసా – రూ.11,000 వరకు ఆర్థిక సాయం

గర్భిణీలకు కేంద్రం ‘మాతృ వందన’ భరోసా – రూ.11,000 వరకు ఆర్థిక సాయం

గర్భిణీలకు కేంద్రం ‘మాతృ వందన’ భరోసా – రూ.11,000 వరకు ఆర్థిక సాయం
February 21, 2026 09:08 PM 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, శిశు సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న (పీఎమ్ఎమ్ వివై) పథకం కింద అర్హులైన మహిళలకు మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.

ఈ పథకం ప్రకారం మొదటి సంతానానికి రూ.5,000 మూడు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది. గర్భధారణ నమోదు అనంతరం రూ.1,000, గర్భధారణ ఆరు నెలలు పూర్తయ్యాక రూ.2,000, శిశువు తొలి టీకా అనంతరం రూ.2,000 చొప్పున చెల్లిస్తారు.

రెండో సంతానం (ప్రత్యేకించి బాలిక జననం) సందర్భంలో అదనంగా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ విధంగా మొత్తం రూ.11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.

దరఖాస్తు చేసుకోవాలనుకునే గర్భిణీలు తమ సమీప అంగన్‌వాడీ కేంద్రంలో ఫారం నింపి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, గర్భధారణ వైద్య నివేదిక సమర్పించాలి. అలాగే అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు.

గర్భిణీలకు పోషకాహారం, తల్లి-శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News