Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:58 PM

గాడిదల పెంపకానికి 50% రాయితీ.. కేంద్రం ప్రోత్సాహం

గాడిదల పెంపకానికి 50% రాయితీ.. కేంద్రం ప్రోత్సాహం

గాడిదల పెంపకానికి 50% రాయితీ.. కేంద్రం ప్రోత్సాహం
March 08, 2026 09:20 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

దేశంలో పశుసంవర్థక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) పథకం కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. పశుపోషకులు, రైతులు గాడిదల పెంపక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ సాయం ఉపయోగపడనుంది.

ఒక గాడిదల పెంపక కేంద్రంలో కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే విదేశీ జాతులకంటే దేశీయ గాడిదలనే పెంచాలని నిర్ణయించింది.

ఈ పథకం ద్వారా గాడిదల సంఖ్య పెరగడంతో పాటు పశుసంవర్థక రంగంలో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News