PRINT TIME: May 26, 2026 04:58 PM
గాడిదల పెంపకానికి 50% రాయితీ.. కేంద్రం ప్రోత్సాహం
గాడిదల పెంపకానికి 50% రాయితీ.. కేంద్రం ప్రోత్సాహం
March 08, 2026 09:20 PM
36 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
దేశంలో పశుసంవర్థక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) పథకం కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. పశుపోషకులు, రైతులు గాడిదల పెంపక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ సాయం ఉపయోగపడనుంది.
ఒక గాడిదల పెంపక కేంద్రంలో కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే విదేశీ జాతులకంటే దేశీయ గాడిదలనే పెంచాలని నిర్ణయించింది.
ఈ పథకం ద్వారా గాడిదల సంఖ్య పెరగడంతో పాటు పశుసంవర్థక రంగంలో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి