దేశంలో పశుసంవర్థక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) పథకం కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. పశుపోషకులు, రైతులు గాడిదల పెంపక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ సాయం ఉపయోగపడనుంది.
ఒక గాడిదల పెంపక కేంద్రంలో కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే విదేశీ జాతులకంటే దేశీయ గాడిదలనే పెంచాలని నిర్ణయించింది.
ఈ పథకం ద్వారా గాడిదల సంఖ్య పెరగడంతో పాటు పశుసంవర్థక రంగంలో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి