వలిగొండ పట్టణంలో రహదారి విస్తరణ పనులపై ఎమ్మెల్యే స్వయంగా పరిశీలన జరపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత గృహాలు, వ్యాపార సముదాయాల వివరాలను సేకరించి ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
పరిహారం అంశంపై త్వరితగతిన చర్యలు తీసుకుని అర్హులైన వారికి న్యాయం చేయాలని సూచించబడింది. పనులు పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొనసాగించేలా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి