Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:58 PM

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు
March 10, 2026 12:39 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్‌ల మధ్య ఉండే గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది.

ఇటీవల సిలిండర్ల కొరత వస్తుందనే భయంతో కొందరు వినియోగదారులు ముందస్తుగా బుకింగ్‌లు చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. సాధారణంగా 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ప్రస్తుతం 15 రోజుల్లోనే మళ్లీ బుకింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో గతంలో 21 రోజుల లాక్-ఇన్ నిబంధనను అమలు చేసిన ప్రభుత్వం, తాజాగా ఆ గడువును 25 రోజులకు పెంచింది.

ఇదిలా ఉండగా, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఇటీవల కేంద్రం రూ.60 ధర పెంపు చేసింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.50 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

అలాగే ఎల్‌పీజీ సరఫరా కోసం అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని తెలిపాయి. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News