Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:32 AM

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు
10-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్‌ల మధ్య ఉండే గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది.

ఇటీవల సిలిండర్ల కొరత వస్తుందనే భయంతో కొందరు వినియోగదారులు ముందస్తుగా బుకింగ్‌లు చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. సాధారణంగా 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ప్రస్తుతం 15 రోజుల్లోనే మళ్లీ బుకింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో గతంలో 21 రోజుల లాక్-ఇన్ నిబంధనను అమలు చేసిన ప్రభుత్వం, తాజాగా ఆ గడువును 25 రోజులకు పెంచింది.

ఇదిలా ఉండగా, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఇటీవల కేంద్రం రూ.60 ధర పెంపు చేసింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.50 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

అలాగే ఎల్‌పీజీ సరఫరా కోసం అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని తెలిపాయి. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు

Article Image

గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్‌ల మధ్య ఉండే గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది.

ఇటీవల సిలిండర్ల కొరత వస్తుందనే భయంతో కొందరు వినియోగదారులు ముందస్తుగా బుకింగ్‌లు చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. సాధారణంగా 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు కూడా ప్రస్తుతం 15 రోజుల్లోనే మళ్లీ బుకింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో గతంలో 21 రోజుల లాక్-ఇన్ నిబంధనను అమలు చేసిన ప్రభుత్వం, తాజాగా ఆ గడువును 25 రోజులకు పెంచింది.

ఇదిలా ఉండగా, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఇటీవల కేంద్రం రూ.60 ధర పెంపు చేసింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.50 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

అలాగే ఎల్‌పీజీ సరఫరా కోసం అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని తెలిపాయి. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News