Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:49 PM

భార్య ప్రేమతో కొండను కరిగించిన అపర భగీరథుడు: దశరథ్ మాంఝీ!

భార్య ప్రేమతో కొండను కరిగించిన అపర భగీరథుడు: దశరథ్ మాంఝీ!

భార్య ప్రేమతో కొండను కరిగించిన అపర భగీరథుడు: దశరథ్ మాంఝీ!
February 06, 2026 08:50 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

భార్య ప్రేమతో కొండను కరిగించిన అపర భగీరథుడు: దశరథ్ మాంఝీ!

భార్యపైఅపారమైన ప్రేమతో కొండను చీల్చి మార్గం నిర్మించిన 'మౌంటైన్ మ్యాన్' దశరథ్ మాంఝీ కథ నేటికీ స్ఫూర్తి దీపం. బీహార్‌లోని గయా జిల్లా, గెలగల ప్రాంతంలోని వంచోలో గుర్రెల్లో జన్మించిన ఈ సాధారణ కార్మికుడు, అసాధారణ కలలు కన్నాడు.సరైన రోడ్డు లేకపోవడంతో, గర్భిణీగా ఉన్న భార్య ఫల్గునియా ఆసుపత్రికి చేరే ముందే కన్నుమూసింది. ఆ ఆవేదన దశరథ్‌ను తల్లడిల్లుపరిచింది. తనలాంటి బాధమరెవరికీ రాకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాడు.కేవలంచేతిలో సుత్తి, గొడ్డలితో 22 సంవత్సరాల పాటు (1960-1982) ఒంటరిగా కొండనుదాటించాడు. కఠినమైన గ్రనైట్ రాళ్లను చీల్చి, 360 అడుగుల పొడవు, 30 అడుగులవెడల్పు, 25 అడుగుల లోతుతో గల అద్భుత మార్గాన్ని సృష్టించాడు. ఈ రోడ్డు వల్ల పట్టణానికి 55 కిలోమీటర్ల దూరం 15 కిలోమీటర్లకు తగ్గింది. వైద్య సౌకర్యం, విద్య, వ్యాపారం సులభమయ్యాయి. గ్రామస్తుల జీవితాలు మారాయి.ప్రధానిఇందిరా గాంధీ, రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఆయన శ్రమను మెచ్చుకున్నారు. పద్మశ్రీ, ప్రజీ పురస్కారం అందుకున్నాడు. 2006లో కన్నుమూసినా, అతని స్మృతిగా ఆ మార్గాన్ని 'దశరథ్ మాంఝీ సడక్' అని పిలుస్తారు. బాలీవుడ్ సినిమా 'మీర్ మాంఝీ' ద్వారా ప్రపంచవ్యాప్తంగాప్రసిద్ధి చెందింది. ఒక్క మనిషి త్యాగం, సంకల్పంతో అసాధ్యాన్ని సాధించాడని నిరూపించాడు. ఈ కథ ప్రతి సమస్యనూ జయిస్తూ ముందుకు సాగాలని ప్రేరేపిస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News