PRINT TIME: May 26, 2026 06:53 PM
బీపీకి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు!శాస్త్రవేత్తల పరిశోధనల్లో సత్ఫలితాలు: లాన్సెట్
బీపీకి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు!శాస్త్రవేత్తల పరిశోధనల్లో సత్ఫలితాలు: లాన్సెట్
February 16, 2026 09:31 PM
28 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
న్యూఢిల్లీ : రక్తపోటు (బీపీ) నియంత్రణకు ఇక రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు! ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చేయించుకుంటే చాలు! ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ ఓ వ్యాసం ప్రచురించింది. దాని ప్రకారం.. అమెరికాకు చెందిన రోష్ అండ్ అల్నైలమ్ ఫార్మాస్యూటికల్స్.. ఆర్ఎన్ఏ టెక్నాలజీతో జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్లో ఉంది. ఇది బీపీకి ప్రధాన కారణమైన, కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంజియోటెన్సినోజెన్ అనే ప్రొటీన్కు అడ్డుకట్ట వేస్తుంది. ఒక ఇంజెక్షన్ చేస్తే 6 నెలల పాటు సమర్థంగా పనిచేసినట్టు పరిశోధనల్లో గుర్తించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి