Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:04 PM

బడ్జెట్–2026 పేదలు మహిళలు యువతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రజాహిత బడ్జెట్ - విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)వెల్లడి

బడ్జెట్–2026 పేదలు మహిళలు యువతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రజాహిత బడ్జెట్ - విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)వెల్లడి

బడ్జెట్–2026 పేదలు మహిళలు యువతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రజాహిత బడ్జెట్ - విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)వెల్లడి
February 02, 2026 12:01 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఢిల్లీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్–2026 దేశ పేదలు మహిళలు యువత అభివృద్ధిని కేంద్రబిందువుగా ఉంచిన సమగ్ర బడ్జెట్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పేర్కొన్నారు..

స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించడం ముఖ్య విశేషమని తెలిపారు.

ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు వ్యాపార రంగంలో ఎదగాలన్న ఆలోచనకు ఈ బడ్జెట్ బలాన్నిస్తోందన్నారు..

ఈ దృక్పథం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో చెబుతున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉందని చెప్పారు.

చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించేలా పలు చర్యలు ప్రకటించారని ముఖ్యంగా బయో ఔషధాలు అర్ధవాహక చిప్ తయారీ కంటైనర్ తయారీ వస్త్ర యంత్రాల తయారీ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశీయ పరిశ్రమలు బలపడతాయని అన్నారు..

అరుదైన భూ ఖనిజాల వినియోగంపై దక్షిణాది రాష్ట్రాలకు అందులో ఆంధ్రప్రదేశ్‌కు అవకాశాలు కల్పించడాన్ని స్వాగతించారు.

చెన్నై–హైదరాబాద్ హైదరాబాద్–బెంగళూరు వేగ రైలు మార్గాల ప్రణాళిక వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు..

మెగా వస్త్ర పార్కులు ఖాదీ–చేనేత అభివృద్ధి క్రీడా సామగ్రి తయారీ యూనిట్ల ఏర్పాటు వంటి నిర్ణయాలు ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తాయని తెలిపారు.

ప్రముఖ దేవాలయాలు ఉన్న నగరాల అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంతో ప్రసిద్ధిగాంచిన విజయవాడకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.

పర్యాటక రంగం అభివృద్ధితో దేశవ్యాప్తంగా వేలాది మందికి మార్గదర్శకులుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు..

క్రీడా రంగంలో ఆటగాళ్లతో పాటు శిక్షకులు వైద్య నిపుణులు సహాయక సిబ్బంది తయారీకి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవడం హర్షణీయమని చెప్పారు.

దేశంలోనే క్రీడా సామగ్రి తయారీ పెంపుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం సాగిందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న వికసిత్ భారత్–2047 దిశగా ఈ బడ్జెట్ బలమైన అడుగని భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ఇది ఉపయుక్తమవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News