అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించలేని మోడీ! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుడిహరినాథ్
అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించలేని మోడీ! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుడిహరినాథ్
GADDAM JAGANMOHAN REDDY
విస్సన్నపేట స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ఎగుమతులపై సుంకాల భారం రోజురోజుకు రెట్టింపు చేస్తుంటే మోడీ నోరు మెదపకపోవడం సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం కాదా అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ ప్రశ్నించారు.అమెరికా సామ్రాజ్యవాద దాడి చమురు కేంద్రాలపై ఆదిపత్యం కోసమేనన్నారు.ట్రంప్ నిరంకుశంగా వెనుజులా అధ్యక్షుడి మధురోను ఆయన భార్యను బందీ చేసి ఆ దేశ సార్వభౌమధికారాన్ని ఖూనీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశారన్నారు. నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవటం హాస్యాస్పదంగా ఉందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ట్రంప్ దుశ్చర్యలను నిలువ రించటంలో వైఫల్యం చెందిందన్నారు. ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించటం భారతదేశంపై 500% సుంకాలు వేస్తానని బాహాటంగా ప్రకటిస్తున్నా మోడీ నోరు మెదపకపోవడం భారత ప్రజలకు తీరని ద్రోహం చేయడమేనని హరినాథ్ విమర్శించారు. గతంలో రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడాన్ని నిరసిస్తూ ట్రంప్ భారతదేశ ఎగుమతులపై 100% సుంకం విధించినా మోడీ నిస్సహాయత వ్యక్తం చేశారని హరినాథ్ విమర్శించారు. అమెరికా నుండి దిగుమతి అయ్యే పత్తికి 11 శాతం సుంకం రాయితీ ఇవ్వటం మోడీ అమెరికా అనుకూల వైఖరిని తెలియజేస్తోందన్నారు. ట్రంప్ మోడీ తమకు అనుకూల నిర్ణయాలే తీసుకుంటారని చెప్పటంలో ఆంతర్యం బోధపడటం లేదన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి