Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

ఐటీ సోదాలు జరుగుతుండగా... తుపాకీతో కాల్చుకుని బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య

ఐటీ సోదాలు జరుగుతుండగా... తుపాకీతో కాల్చుకుని బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య

ఐటీ సోదాలు జరుగుతుండగా... తుపాకీతో కాల్చుకుని బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య
February 01, 2026 03:06 AM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సీజే రాయ్ ఆత్మహత్య

ఆదాయపన్ను శాఖ సోదాల నేపథ్యంలో కార్యాలయంలోనే ఘటన తుపాకితో తలపై కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న వైనం ఐటీ దాడుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక సమాచారం

రియల్ ఎస్టేట్ రంగంలోనే కాక, సినీ నిర్మాతగానూ ఆయన ప్రసిద్ధి

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన కార్యాలయంలో శుక్రవారం తుపాకితో కాల్చుకుని ఆయన ప్రాణాలు విడిచారు. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆయన సంస్థలపై సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గత రెండు, మూడు రోజులుగా కాన్ఫిడెంట్ గ్రూప్‌కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వరుస దాడులతో సీజే రాయ్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం లాంగ్‌ఫోర్డ్ రోడ్‌లోని తన ఆఫీసులో తలపై తుపాకితో కాల్చుకున్నారు. సిబ్బంది వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ తనను తాను కాల్చుకున్నారు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గత 2-3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు, వారికి సమాచారం అందించాం" అని తెలిపారు.

కేరళలోని కొచ్చికి చెందిన సీజే రాయ్, కాన్ఫిడెంట్ గ్రూప్‌ను స్థాపించి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటక, కేరళలో అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టారు. వ్యాపారవేత్తగానే కాకుండా, ఆయన మలయాళంలో సినీ నిర్మాతగానూ సుపరిచితులు. మోహన్‌లాల్ హీరోగా నటించిన 'కాసనోవా' చిత్రాన్ని నిర్మించారు. ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News