100 పడకల ఆసుపత్రి కోసం దీక్షకు వైద్యుల మద్దతు. డాక్టర్ అశోక్
100 పడకల ఆసుపత్రి కోసం దీక్షకు వైద్యుల మద్దతు. డాక్టర్ అశోక్
స్థానికం బృందం
రామన్నపేటలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం సీపీఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షకు మద్దతుగా వైద్యులు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో వైద్యుడు డాక్టర్ అశోక్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే 100 పడకల ఆసుపత్రి అత్యవసరమని ఆయన అన్నారు. అందుకోసం ప్రజలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స కూడా సరిగా అందని పరిస్థితి నెలకొనడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతతో ప్రపంచ దేశాలు వైద్య రంగంలో ముందుకు సాగుతున్నప్పటికీ, ఇక్కడ మాత్రం సరైన సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
గతంలో హామీలు ఇచ్చినా అమలు కాలేదని, రామన్నపేటపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందని విమర్శించారు. 100 పడకల ఆసుపత్రి ఏర్పడితే నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జరుగుతున్న దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆసుపత్రి కోసం అవసరమైన నిధులు కేటాయించాలని డాక్టర్ అశోక్ డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి