ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు – అభివృద్ధికి విఘాతం అంటూ ఆందోళన
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు – అభివృద్ధికి విఘాతం అంటూ ఆందోళన
GADDAM JAGANMOHAN REDDY
న్యూఢిల్లీ,
రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై భారంగా మారుతూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాల కంటే ఉచిత పథకాల అమలుపైనే దృష్టి సారిస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ వంటి పథకాల కంటే ఉపాధి అవకాశాల సృష్టి, స్థిరమైన ఆర్థికాభివృద్ధి చర్యలపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని హితవు పలికింది.
ఉచిత పథకాలు అర్హులకే పరిమితం కావాలనీ, భూయజమానులు వంటి సామర్థ్యవంతులకు కూడా ఇవి అందడం సరికాదని వ్యాఖ్యానించింది.
ఉచిత విద్యుత్ అందించాలన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) విజ్ఞప్తిపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి దిశగా సమతుల్య విధానాలు అవసరమని కోర్టు స్పష్టం చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి