Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:37 AM

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు – అభివృద్ధికి విఘాతం అంటూ ఆందోళన

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు – అభివృద్ధికి విఘాతం అంటూ ఆందోళన

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు – అభివృద్ధికి విఘాతం అంటూ ఆందోళన
19-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ,

రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై భారంగా మారుతూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాల కంటే ఉచిత పథకాల అమలుపైనే దృష్టి సారిస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ వంటి పథకాల కంటే ఉపాధి అవకాశాల సృష్టి, స్థిరమైన ఆర్థికాభివృద్ధి చర్యలపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని హితవు పలికింది.

ఉచిత పథకాలు అర్హులకే పరిమితం కావాలనీ, భూయజమానులు వంటి సామర్థ్యవంతులకు కూడా ఇవి అందడం సరికాదని వ్యాఖ్యానించింది.

ఉచిత విద్యుత్ అందించాలన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) విజ్ఞప్తిపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి దిశగా సమతుల్య విధానాలు అవసరమని కోర్టు స్పష్టం చేసింది.

Sthanikam

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు – అభివృద్ధికి విఘాతం అంటూ ఆందోళన

Article Image

న్యూఢిల్లీ,

రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై భారంగా మారుతూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాల కంటే ఉచిత పథకాల అమలుపైనే దృష్టి సారిస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ వంటి పథకాల కంటే ఉపాధి అవకాశాల సృష్టి, స్థిరమైన ఆర్థికాభివృద్ధి చర్యలపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని హితవు పలికింది.

ఉచిత పథకాలు అర్హులకే పరిమితం కావాలనీ, భూయజమానులు వంటి సామర్థ్యవంతులకు కూడా ఇవి అందడం సరికాదని వ్యాఖ్యానించింది.

ఉచిత విద్యుత్ అందించాలన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) విజ్ఞప్తిపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి దిశగా సమతుల్య విధానాలు అవసరమని కోర్టు స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News