Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:40 AM

ఓటర్ల జాబితా సర్‌పై ఈసీ ఆదేశాలు – రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం

ఓటర్ల జాబితా సర్‌పై ఈసీ ఆదేశాలు – రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం

ఓటర్ల జాబితా సర్‌పై ఈసీ ఆదేశాలు – రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం
February 20, 2026 11:03 AM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (ఎస్‌ఆర్‌) సన్నాహకాలను వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల యంత్రాంగం కదిలింది. తదుపరి దశ సమీక్ష ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశముండటంతో అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఈ ప్రక్రియ పూర్తయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఎస్‌ఆర్‌ పూర్తయినట్లే అవుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించింది.

ప్రభావం ఇలా ఉండనుంది:

బూత్‌ లెవల్‌ అధికారుల నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు వేగవంతం.

కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పుల పరిశీలనకు ప్రత్యేక డ్రైవ్‌లు.

రాజకీయ పార్టీలతో సమన్వయం పెంపు.

ఎన్నికల ముందు ఓటర్ల జాబితా పారదర్శకత, ఖచ్చితత్వం పెరుగుదల.

రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఫీల్డ్‌ స్థాయి ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం అన్ని దశలను సమయానికి పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News