Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:14 PM

చింతల బాబుకు ఘన సన్మానం

చింతల బాబుకు ఘన సన్మానం

 చింతల బాబుకు ఘన సన్మానం
January 27, 2026 09:30 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

దినోత్సవం సందర్భంగా వలిగొండ గ్రామపంచాయతీకి కార్యదర్శిగా సేవలందిస్తున్న చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన చింతల బాబు కు ఉత్తమ గ్రామపంచాయతీ కార్యదర్శిగా సేవ ప్రశంసాపత్రాన్ని అందుకోవడంతో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో వారికి పూలమాలతో, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అభ్యుదయ యూత్ అసోసియేషన్ సభ్యుడైన చింతల బాబు వలిగొండలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఉత్తమంగా విధులు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవ ప్రశంసా పత్రాన్ని వారికి ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగించిందని అన్నారు. మునుముందు ప్రభుత్వ అధికారిగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా చింతల బాబు మాట్లాడుతూ..చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీలో 13 సంవత్సరాలు సభార్డినేటర్ గా పని చేయడంతో ప్రమోషన్ గా వలిగొండ గ్రామపంచాయతీకి బిల్ కలెక్టర్ గా సేవలందించానని, ఆ తదుపరి చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామపంచాయతీకి మొట్టమొదటిసారిగా గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహించానని తెలిపారు. అనంతరం వలిగొండ గ్రామపంచాయతీకి కార్యదర్శిగా మూడు సంవత్సరముల నుండి విధులు నిర్వహిస్తున్నడంతో నా యొక్క విధులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కార్యదర్శిగా సేవ ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదగా అందుకోవడం చాలా ఆనందాన్ని కలగజేసింది అని తెలిపారు. ఈ ఉత్సాహంతో మునుముందు గ్రామపంచాయతీకి మరింత సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ యొక్క పురస్కారం అందుకున్న తరుణంలో నా చిన్ననాటి మిత్రులు ఈరోజు నన్ను సన్మానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో అభ్యుదయ యూత్ గౌరవ అధ్యక్షులు వర్కల కుమార్ గౌడ్, అధ్యక్షులు తొర్పునూరి బాబు, గౌరవ సలహాదారులు మొగుదాల రాములు గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్,చెరుకు అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తొర్పునూరి రవి, సభ్యులు తొర్పునూరి మల్లేష్, మార్గం నరసింహ, ఎర్రసాని శ్రీనివాస్ యాదవ్, బొమ్మిరెడ్డి జీవన్ రెడ్డి, మోగుదాల రాకేష్, తోర్పునూరి సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News