వెంకటాపురం గ్రామానికి చెందిన పెరమళ్ళ కనకమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ ఈరోజు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కనకమ్మ వైద్య ఖర్చుల కోసం రూ.5,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కౌన్సిలర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సహకారంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన వైద్య సహాయం పూర్తిగా అందేలా తాము కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
స్థానికులు కౌన్సిలర్ స్పందనను అభినందిస్తూ, కనకమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి