Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి

పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి

పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి
December 29, 2025 05:38 AM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nagole
Chanikya Madhu

రాంనగర్‌కు చెందిన ప్రణవ్ రాయ్ మృతిపై విద్యార్థి సంఘాల ఆగ్రహం..

కాలేజీ యాజమాన్యం తీరే కారణమని ఆరోపణ.

స్థానికం హైదరాబాద్ : నగరంలోని బాగ్ అంబర్‌పేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలో పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు

హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ – స్వాతి దంపతుల కుమారుడు కేవీఎస్ ప్రణవ్ రాయ్ సాయి (17), బాగ్ అంబర్‌పేటలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కాలేజీలో స్లిప్ టెస్ట్ ఉండటంతో, తండ్రి శ్రీనివాస్ ఉదయం 8:30 గంటల సమయంలో కుమారుడిని కాలేజీ వద్ద వదిలి వెళ్లారు. పరీక్ష రాస్తున్న సమయంలో ప్రణవ్ ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురై బెంచీపైనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రణవ్ మరణించాడని వైద్యులు ధృవీకరించారు.

యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆరోపణలు

మృతుడు ప్రణవ్ రాయ్‌కు చిన్నప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరే విద్యార్థి మరణానికి దారితీసిందని తోటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సెలవు రోజున పరీక్ష: క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, సదరు కళాశాల నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మెట్లపై తిప్పడంతో పెరిగిన ఒత్తిడి: ప్రణవ్ పరీక్ష రాయాల్సిన హాల్ కింద అంతస్తులో ఉన్నప్పటికీ, సిబ్బంది పొరపాటున పై అంతస్తుకు పంపారు. తిరిగి పైనుంచి కిందకు మెట్లపై పదేపదే తిరగడం వల్ల శారీరక శ్రమ పెరిగి, గుండెపై ఒత్తిడి పడిందని తోటి విద్యార్థులు వాపోతున్నారు.

విద్యార్థి సంఘాల డిమాండ్

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సెలవు రోజుల్లో కూడా ఒత్తిడికి గురిచేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News