చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు
చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు
Deshamkosam
ఏరియా: చైనా
స్థానికం ప్రతినిధి – దేశం కోసం
చోంగ్క్వింగ్కు చెందిన లీ షియాకు చిన్ననాడే మస్క్యులర్ డిస్ట్రోఫీ వచ్చి, 36 ఏళ్లకే కేవలం ఒక వేలు, ఒక పాదవేలుతో మాత్రమే కదలగలిగే స్థితి. వెంటిలేటర్పై ఆధారపడి ఉన్నా, ఆసుపత్రి బెడ్పైనుంచే పూర్తిగా ఆటోమేటెడ్ స్మార్ట్ వ్యవసాయ సిస్టమ్ రూపొందించాడు.
చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్న లీ, ఆన్లైన్లొ స్వయంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 2021లో శరీరం పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, వర్చువల్ కీబోర్డ్తో కోడ్ రాస్తూ స్మార్ట్ వ్యవసాయ వ్యవస్థను డిజైన్ చేశాడు.
ఈ సిస్టమ్తో ఉష్ణోగ్రత, తేమ, నీరుపోసే విధానం, సెన్సర్లు, పరికరాలు అన్నీ ఆటోమేటిక్గా నియంత్రించవచ్చు.
ఈ ప్రయాణంలో లీ తల్లి వు డిమే ప్రధాన బలం. ఎలక్ట్రానిక్స్ తెలియకపోయినా, లీ సూచనలతో సర్క్యూట్ బోర్డులు కలపడం, పరికరాలు సరి చేయడం, డ్రైవర్లెస్ వాహనం తయారు చేయడం వరకు నేర్చుకుంది.
ప్రస్తుతం లీ రూపొందించిన స్మార్ట్ ఫామ్ విజయవంతంగా నడుస్తోంది. ఉత్పత్తి పెంచడం, కొత్త పంటలు ప్రయత్నించడం, మరింత ఆటోమేషన్ చేయడం అతని తదుపరి లక్ష్యాలు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి