Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:37 AM

భానుడి భగభగలకు బ్రేక్ తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు – వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక

భానుడి భగభగలకు బ్రేక్ తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు – వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక

భానుడి భగభగలకు బ్రేక్ తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు – వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక
16-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్: మండుతున్న ఎండల మధ్య తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో వచ్చే ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటమే ఈ వర్షాలకు కారణమని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఈ ప్రభావంతో ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి.

ఎండల తీవ్రతకు బ్రేక్

ఈ ఏడాది తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంటుంది. అయితే ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు తీవ్రంగా మండడం ప్రారంభమైంది. మార్చి ప్రారంభానికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతుండగా మధ్యాహ్నం సమయాల్లో నగరాలు, పట్టణాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటిపూట ఎండలు ఎక్కువగా ఉండగా రాత్రిపూట కూడా ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్లు అయ్యింది.

Sthanikam

భానుడి భగభగలకు బ్రేక్ తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు – వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక

Article Image

హైదరాబాద్: మండుతున్న ఎండల మధ్య తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో వచ్చే ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటమే ఈ వర్షాలకు కారణమని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఈ ప్రభావంతో ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి.

ఎండల తీవ్రతకు బ్రేక్

ఈ ఏడాది తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంటుంది. అయితే ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు తీవ్రంగా మండడం ప్రారంభమైంది. మార్చి ప్రారంభానికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతుండగా మధ్యాహ్నం సమయాల్లో నగరాలు, పట్టణాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటిపూట ఎండలు ఎక్కువగా ఉండగా రాత్రిపూట కూడా ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్లు అయ్యింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News