Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 04:19 PM

యూకేలో చదువుతున్న విద్యార్థులకు యూఏఈ స్కాలర్‌షిప్‌లకు కోత

యూకేలో చదువుతున్న విద్యార్థులకు యూఏఈ స్కాలర్‌షిప్‌లకు కోత

యూకేలో చదువుతున్న విద్యార్థులకు యూఏఈ స్కాలర్‌షిప్‌లకు కోత
January 13, 2026 08:44 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Deshamkosam

స్థానికం ప్రతినిధి: దేశం కోసం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూకే (బ్రిటన్)లో ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రభుత్వ స్కాలర్‌షిప్ అర్హత జాబితా నుంచి తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో ఇకపై యూకేలో చదవాలనుకునే ఎమిరాటి విద్యార్థులకు యూఏఈ ప్రభుత్వ ఆర్థిక సహాయం అందదు.

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, యూకే విశ్వవిద్యాలయాల్లో తీవ్రవాద భావజాలం ప్రభావం పెరుగుతోందన్న ఆందోళనలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ఇస్లామిస్టు సంఘాల కార్యకలాపాలపై యూఏఈకి భద్రతా పరమైన సందేహాలు ఉన్నట్లు సమాచారం.

అయితే, ఇది యూకేలో చదువుపై పూర్తిస్థాయి నిషేధం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఎమిరాటి విద్యార్థులు స్వంత ఖర్చులతో యూకేలో ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. కానీ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక మద్దతు మాత్రం ఇక అందుబాటులో ఉండదని తెలిపారు.


ఈ నిర్ణయం వల్ల యూకేలో చదువుతున్న మరియు చదవాలని భావిస్తున్న వేలాది మంది యూఏఈ విద్యార్థులపై ప్రభావం పడే అవకాశముందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే యూఏఈ–యూకే మధ్య ఉన్న విద్యా సంబంధాలపై కూడా దీని ప్రభావం ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఇటీవలి కాలంలో యూఏఈ ప్రభుత్వం తన విద్యార్థులను ఇతర దేశాలైన అమెరికా, యూరప్‌లోని కొన్ని దేశాలు, ఆసియా ప్రాంతాలకు మళ్లించే దిశగా విధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ తాజా నిర్ణయం అదే విధానంలో భాగంగా భావిస్తున్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News