మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
K.RAVI
సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం..
-ఏసీపి మధుసూదన్ రెడ్డి
చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి
ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకమని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెట్రో ఉదయం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను పోలీస్ స్టేషన్ పరిధిలో వారి చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులనుచేస్తూ, ప్రజా సమస్యలను వెలికితీయడంలో మెట్రో ఉదయం దినపత్రిక ముందు వరుసలో ఉంటుందని కొనియాదారు. నేడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేసే పత్రికల పాత్ర అనిర్వచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనం కల్పించే శక్తివంతమైన, స్వతంత్ర విభాగంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మన్మధ కుమార్, మెట్రో ఉదయం రిపోర్టర్ కత్తుల రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి