Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:00 PM

కొండమీద.. కోడి.. రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ మాంసం..గుడ్ల ధరలు

కొండమీద.. కోడి.. రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ మాంసం..గుడ్ల ధరలు

కొండమీద.. కోడి.. రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ మాంసం..గుడ్ల ధరలు
December 29, 2025 02:05 AM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కొండమీద.. కోడి..

రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ మాంసం..గుడ్ల ధరలు

స్థానిక ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. వంటింట్లో కుపంటి పెట్టాలంటేనే దడుసుకునే పరిస్థితి నెలకొంది. ఉప్పు, పప్పులతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఇదే బాటలో చికెన్‌, గుడ్ల ధరలు కూడా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్‌ 280 నుంచి రూ.300 వరకు పలుకుతుంది. ఇక గుడ్డు ధర ఏకంగా రూ.8..8:30 చేరింది. కేవలం వారములోనే కిలో చికెన్ పై 50 రూపాయలు పెరిగింది. కార్తీకమాసం ముగిసినప్పటి నుండి చికెన్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇలా క్రమంగా వారం వారం కిలో చికెన్ పై 10 నుంచి 20 రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం కేజీ స్కిన్ చికెన్ 260 కాగా.. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 నుండి 300 పలుకుతుంది.

ఈ రోజు ఆదివారం కావడంతో మాంసం ప్రియులు అధిక ధరలు చెల్లించి చికెన్‌ ముక్క కొనలేక గుటకలు వేస్తున్నారు. వచ్చే నెలలో సంక్రాంతి ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు గుడ్ల ధరలు కూడా పెరగడంతో మధ్యాహ్న భోజనంలో విద్యార్ధులకు సైతం అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే చెల్లిస్తోంది. కానీ మార్కెట్‌లో హోల్‌సేల్ ధర రూ. 7.50 ఉంది. రిటైల్ ధర రూ. 10 పలుకుతోంది. ఈ క్రమంలో విద్యార్దులకు వారానికి మూడు సార్లు అందించవల్సిన గుడ్లను రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు.

ప్రధానంగా రెండు కారణాలు..

కాగా గత కొద్దిరోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం ముగియడం, వరుస పండుగలు రావడంతో చికెన్‌కి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేకపోవడంతో సరఫరా దెబ్బతిని ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. మొత్తం వచ్చే పండగ నెలలోనూ చికెన్‌ రేట్లు కిలో రూ.350 నుంచి రూ.400 వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News