అసలుకే నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే,! ఏలూరు జిల్లా చింతలపూడిలో ఐతే ఆకాశాన్నే దాటుతున్నాయి?
అసలుకే నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే,! ఏలూరు జిల్లా చింతలపూడిలో ఐతే ఆకాశాన్నే దాటుతున్నాయి?
GADDAM JAGANMOHAN REDDY
చింతలపూడి ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లో ఉన్నటువంటి కిరాణా షాపుల్లో, మార్ట్స్ లలో నిత్యవసర సరుకులు ఇష్టానుసారంగా అమ్ముతున్న దుకాణా దారులు. రేట్లు అదుపులో లేకుండా, వాళ్లు నిర్ణయించినా రెట్లకు ప్రజలు కొనుగోలు చేస్తున్నా పరిస్థితి చింతలపూడి లో ఉన్నటువంటి మార్ట్ లలో, మార్కెట్ రేటు కంటే,30,నుంచి 60 రూపాయలు అధిక ధరలు అమ్ముతున్న యజమానులు.చింతలపూడి లో ఉన్న ప్రతి దుకాణ షాప్ వద్ద నకిలీ వంట నూనెలు అమ్ముతున్నారని ఆరోపణలు.ప్రియ, నవీన, ఆలీ అనే రకరకాల పేర్లతో, అవే కాకుండా చింతలపూడిలో ఇతర పేర్లతో సన్ ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు.910 గ్రాముల నూనె ప్యాకెట్ గాను 850 గ్రాముల నూనె ప్యాకెట్లు మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు కందిపప్పు, పెసరపప్పు, శనగపిండి, ధనియాలు, ఇలా పతి సరుకులు మీద కేజీకి 50 నుంచి 60 రూపాయల వరకు వ్యత్యాసాలు ఉన్నట్టు ప్రజలు గుర్తింపు, మీడియా వద్దకు వచ్చిన కొందరు బాధితులు. చింతలపూడి నుంచి సుమారుగా 30 కిలోమీటర్లు లో ఉన్నటువంటి గ్రామాలకు మినీ లారీలు, దోస్త్ ఆటోలు ద్వారా 10 లక్షల రూపాయలు సరుకు షాపులకు ఎలాంటి బిల్లులు లేకుండా పంపుతున్న పట్టించుకోని అధికారులు అని ఆరోపణలు. ఉన్నతాధికారులు పరిరక్షణ లేక దుకాణ యజమానులు ఎవరికి నచ్చినట్టు ఇష్టానుసారంగా రేట్లు అమ్ముతున్నారని చింతలపూడి గ్రామస్తులు ఆరోపణలు. ఉన్నతాధికారులు మరియు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పరిరక్షణ చేసి ప్రజలకు నిత్యవసర సరుకులు ధరలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి