రాంచీలో కోహ్లీ మాస్ బ్యాటింగ్.. సౌతాఫ్రికా బౌలర్లకి చుక్కలే! రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ!
రాంచీలో కోహ్లీ మాస్ బ్యాటింగ్.. సౌతాఫ్రికా బౌలర్లకి చుక్కలే! రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ!
Editor Desk
నిన్న రాంచీలో మన ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ అస్సలు మామూలుగా లేకుండే! మన 'కింగ్' విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో దిగగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయిండు. బాల్ దొరికితే చాలు బౌండరీ దాటించేసిండు.
మొత్తానికి 120 బంతులు ఆడిన కోహ్లీ.. 11 ఫోర్లు, 7 సిక్సర్లతో దంచి కొట్టి 135 రన్స్ చేసిండు. దీంతో తన 52వ వన్డే సెంచరీ పూర్తి చేసుకొని, సచిన్ రికార్డులను కూడా దాటేసిండు. రోహిత్ శర్మ (57 రన్స్) తో కలిసి కోహ్లీ కట్టిన పార్ట్నర్షిప్ మ్యాచ్కే హైలైట్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యర్థి బౌలర్లని ఉతికి ఆరేశారు.
మన కోహ్లీ దెబ్బకి ఇండియా స్కోరు 349 కి చేరింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా వాళ్లు గట్టిగానే కొట్లాడినా, మన బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో చివరికి 17 రన్స్ తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.
మొత్తానికి నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ ఆట చూసి ఫ్యాన్స్ అంతా "జై కోహ్లీ.. జైజై కోహ్లీ" అంటూ చిందులేశారు. రాంచీ గ్రౌండ్ మొత్తం కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయింది!

















































పాఠకుల అభిప్రాయాలు
కామెంట్ను పోస్ట్ చేయండి