న్యాల్కల్లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం
న్యాల్కల్లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా | న్యాల్కల్ మండలం
మండల కేంద్రమైన న్యాల్కల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడాపోటీలను అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ, క్రీడలు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ షాగుప్తా ఇఫ్తాఖ్, మండల విద్యాధికారి మారుతి రాథోడ్, ఎస్ఐ దోమ సుజిత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిరేదార్ శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండంగారి తిరుపతిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి, డీసీసీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్రెడ్డి, నాయకులు గార్లపల్లి శివరాజ్, ప్రవీణ్ కుమార్, కాశప్ప, ఇసాం పటేల్తో పాటు ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి