Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

న్యాల్కల్ ఉర్సే షరీఫ్ జాతరలో నేడు అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

న్యాల్కల్ ఉర్సే షరీఫ్ జాతరలో నేడు అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

న్యాల్కల్ ఉర్సే షరీఫ్ జాతరలో నేడు అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
February 03, 2026 12:31 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న ఉర్సే షరీఫ్ జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు.

జాతర ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి అఖాడాలో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన మల్లయోధులు బరిలోకి దిగనుండటంతో జాతర ప్రాంగణం కేరింతలు, ఈలలతో మారుమోగనుందని నిర్వాహకులు తెలిపారు. మల్లయోధుల మధ్య ‘నువ్వా నేనా’ అన్నట్టుగా ఉత్కంఠభరిత పోటీలు సాగనున్నాయని పేర్కొన్నారు.ఈ కుస్తీ పోటీలను తిలకించడంతో పాటు దర్గా దర్శనానికి జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ శెట్కార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి హాజరవుతారని న్యాల్కల్ సొసైటీ మాజీ చైర్మన్ సిద్ధలింగయ్యస్వామి తెలిపారు.కుస్తీ పోటీల సందర్భంగా గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

కుస్తీ పోటీలతో పాటు జాతర సందర్భంగా భక్తుల సందడి, వ్యాపారుల కోలాహలం, సంప్రదాయ వైభవం కలిసి న్యాల్కల్ జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News