Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:49 PM

విధ్వంసం సృష్టించిన దూబే.. కానీ దురదృష్టం వెక్కిరించింది! కివీస్ చేతిలో భారత్ పోరాడి ఓటమి

విధ్వంసం సృష్టించిన దూబే.. కానీ దురదృష్టం వెక్కిరించింది! కివీస్ చేతిలో భారత్ పోరాడి ఓటమి

విధ్వంసం సృష్టించిన దూబే.. కానీ దురదృష్టం వెక్కిరించింది! కివీస్ చేతిలో భారత్ పోరాడి ఓటమి
January 28, 2026 10:44 PM 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విశాఖపట్నం:

వైజాగ్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ నాలుగో టి20 మ్యాచ్‌లో టీమిండియాకు చుక్కెదురైంది. భారీ లక్ష్య ఛేదనలో శివమ్ దూబే సునామీ ఇన్నింగ్స్ ఆడి గెలుపుపై ఆశలు రేపినప్పటికీ, ఒక ఊహించని దురదృష్టకర రన్ అవుట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

దూబే పరుగుల ఊచకోత!

216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దూబే, మొత్తం 23 బంతుల్లో 65 పరుగులు (5 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు.

ఆ ఒక్క దెబ్బతో అంతా తారుమారు!

భారత్ విజయానికి చేరువవుతున్న సమయంలో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. హర్షిత్ రాణా కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ షాట్‌ను బౌలర్ మ్యాట్ హెన్రీ ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ బంతి హెన్రీ వేళ్లకు తగిలి నేరుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకింది. ఆ సమయంలో దూబే క్రీజుకు వెలుపల ఉండటంతో దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. టీమిండియాను గెలిపిస్తాడనుకున్న హీరో ఇలా వెనుదిరగడం మ్యాచ్‌కే 'మాగ్జిమం డ్యామేజ్' గా మారింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది.

భారత బ్యాటింగ్ హైలైట్స్:

శివమ్ దూబే (టాప్ స్కోరర్): కేవలం 23 బంతుల్లో 65 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇందులో 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. దూబే స్ట్రైక్ రేట్ 282.61 గా నమోదైంది. దురదృష్టవశాత్తు హెన్రీ వేసిన బంతికి రన్ అవుట్ అయ్యాడు.

రవి బిష్ణోయ్: 10 బంతుల్లో ఒక ఫోర్ తో 10 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

హర్షిత్ రాణా: 13 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 9 పరుగులు చేశాడు.

హార్దిక్ పాండ్యా: 5 బంతుల్లో 2 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

జస్ప్రీత్ బుమ్రా: 2 బంతుల్లో ఒక ఫోర్ తో 4 పరుగులు చేశాడు.

కుల్దీప్ యాదవ్: 3 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు.

అర్ష్‌దీప్ సింగ్: 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు.

"దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడం మరియు కీలక సమయంలో రన్ అవుట్ అవ్వడం భారత్ ఓటమిని శాసించాయి."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News